Header Banner

కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం! ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం!

  Wed Jun 11, 2025 08:30        Others

కెన్యాలో భయానక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఖతర్‌లో నివాసముంటున్న ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని ఖతర్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. ప్రమాద సమయంలో వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి పర్యటన నిమిత్తం కెన్యాలో ఉన్నట్టు తెలిసిందిమొత్తం 28 మంది ప్రవాస భారతీయులు ఒక బస్సులో ప్రయాణిస్తుండగా.. వారి వాహనం ప్రమాదవశాత్తూ లోయలోకి పడిపోయిందని తెలుస్తోంది. ఈ ఘటన నైరోబికి సమీపంలోని పర్యాటక ప్రదేశం వద్ద జరిగింది. ప్రమాదానికి గల అసలైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. బస్సు అదుపుతప్పి లోయలో పడిందా? లేక మరే ఇతర వాహనం ఢీ కొట్టిందా ? అన్నది అధికారులు పరిశీలిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: భూములను ఇచ్చిన రైతులకు నేడు రిటర్నబుల్ ప్లాట్లు.. అవి ఏ ఏ ప్రాంత వాసులకు అంటే!

ఇక ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి గాయాలయినట్టు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వారు నైరోబిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఈ దుర్ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ.. ఘటన స్థలానికి నైరోబిలోని భారత రాయబార కార్యాలయ అధికారులు చేరుకున్నారని స్పష్టం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని.. స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ప్రకటించారు. గాయపడినవారికి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తున్నామని వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

 

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

ఏపీలో ఆ ఉద్యోగులకు బదిలీలు! త్వరలో ఉత్తర్వులు జారీ!

 

ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు.. వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది! షర్మిల ఫైర్‌..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..

 

ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!

 

ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!

 

ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

  


   #AndhraPravasi #KenyaAccident #IndianDiaspora #TragicAccident #RoadAccident #NairobiTragedy #ExpatsLost #IndianEmbassy #KenyaNews #TouristTragedy #SafetyAbroad #RIP